Food Poisoning: వేసవిలో ఫుడ్ పాయిజనింగ్ ఎందుకవుతుందో తెలుసా?

by Disha Web Desk 10 |
Food Poisoning: వేసవిలో ఫుడ్ పాయిజనింగ్  ఎందుకవుతుందో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : వేసవి కాలంలో ఫుడ్ పాయిజనింగ్‌తో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఎండాకాలంలో ఫుడ్ పాయిజనింగ్ కు గురయ్యే ప్రమాదం ఎక్కువ. ఫుడ్ పాయిజనింగ్‌కు గల కారణాలను ఇక్కడ తెలుసుకుందాం.

1. ఉడకని ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. హానికరమైన బ్యాక్టీరియాను చంపడానికి, ఆహార విషాన్ని నివారించడానికి సరైన ఉష్ణోగ్రత వద్ద ఆహారాన్ని ఉడికించి తీసుకోవాలి. ఉడకని ఆహారంలో బ్యాక్టీరియా , క్రీములు అలాగే ఉండిపోయి అవి కడుపులోకి వెళ్లినప్పుడు ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది.

2. కలుషిత నీరు తాగడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగే ప్రమాదం ఉంది. వేసవిలో ప్రయాణాలు చేసేటప్పుడు, క్యాంపింగ్ చేసినప్పుడు.. సరస్సులు,బావులు, వద్ద నీటిని తాగడం వల్ల ఈకోలి, సాల్మోనెల్లా వంటి హానికరమైన బ్యాక్టీరియా కడుపులోకి చేరుతుంది. దీని వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. కాబట్టి కాచి చల్లార్చిన నీళ్లను తీసుకోవాలి.

Read more:

వామ్మో.. అక్కడ పుచ్చకాయ ధర రూ. 5 లక్షలు.. స్పెషల్ ఏమిటంటే?

Next Story